Sunday, May 5, 2024

TS: కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్లు.. సాహితీ మాణిక్యం పురస్కార సభలో మంత్రి పువ్వాడ

కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్ల వంటి వారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సాహితీ మాణిక్యం పురస్కార ప్రధాన సభలో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పలువురు కవులు, రచయితలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కవులు బంగారు తెలంగాణ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ప్రతి సంవత్సరం తెలుగుమహాసభల పేరుతో కవులకు అరుదైన గౌరవాన్ని ఇస్తున్నారని మంత్రి పువ్వాడ గుర్తు చేశారు. తెలంగాణలో కవులకు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. కవుల్లో ఉన్న ఉత్తేజం, ఉత్సాహం చూస్తే చాలా ఆనందం కలుగుతుందని అన్నారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కవి, విమర్శకులు, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్​ సీతారాం ప్రతి సంవత్సరం తన మాతృమూర్తి పేరిట సాహితీ మాణిక్యం పురస్కారాలు అందజేస్తున్నారు. కాగా, 2020-21 సంవత్సరానికి ఎంపికైన కవులు, కవయిత్రులలో ఆకెళ్ల రవి ప్రకాష్, షాజహానా, జూపాక సుభద్ర, వనపట్ల సుబ్బయ్యకు పురస్కారాలను ప్రదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement