Tuesday, April 30, 2024

Parakala -వర్ష ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి – అండగా ఉంటాం అంటూ బాధితులకు హామీ

పరకాల నియోజకవర్గంలో గత కొద్దరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నడికుడ మండలం నార్లాపూర్ గ్రామంలో వరద ముంచెత్తింది.శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి నార్లాపూర్ గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా వరద తీవ్రతకు దెబ్బతిన్న ఇండ్లను,రోడ్లను పరిశీలించారు.స్థానికంగా ఉన్న ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

వరద తీవ్రతకు ఇండ్లలోకి నీరుచేరిన తీరును చూసి భాదగా ఉందన్నారు. బాధితులకు వెంటనే పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు.ఇండ్లు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలని ప్రజలను కోరారు.

తెగిన రోడ్డును పరిశీలన..

నడికుడ మండలం నార్లాపుర్ నుండి వెంకటేశ్వర్లపల్లి గ్రామాల మధ్యలో వరద తీవ్రతకు తెగిపోయిన రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు.త్వరలోనే నూతన రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ,బి.ఆర్.ఎస్.నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement