Saturday, May 4, 2024

గీతా కార్మిక సహ‌కార ఆర్థిక సంస్థ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌ల్లె ర‌వి కుమార్

హైద‌రాబాద్ : రాష్ట్ర గీతా కార్మిక సహ‌కార ఆర్థిక సంస్థ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌ల్లె ర‌వి కుమార్ గౌడ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ప‌ల్లె ర‌వి కుమార్ రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. పల్లె ర‌వి కుమార్ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కాగా, ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement