Monday, April 29, 2024

హిందీలో విరూపాక్ష‌.. ముంబైలో సాయిధ‌ర‌మ్ తేజ్

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం విరూపాక్ష‌.ఈ మూవీ క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది. కొత్త దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించాడు. విరూపాక్ష మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినా.. ముందుగా తెలుగు, భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ రిజల్ట్ ను బట్టి.. బాలీవుడ్ తో పాటు.. ఇతర భాషల్లో రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. వారు అనుకున్న విధంగా.. తెలుగులో ఈమూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని పొందడంతో.. ఇక ఇతర భాషలపై దృష్టి పెట్టారు మేకర్స్ . ముందుగా బాలీవుడ్ పై గట్టిగా దృష్టి పెట్టారు. విరూపాక్షను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా హిందీలో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అంతే కాదు ముంబయ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. హీరో సాయి ధరమ్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన సాయి ధరమ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి ఎవరు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. సడెన్ సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా అన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హిందీలో గోల్డ్ మైన్స్ సంస్థ, తమిళంలో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ లు ఈ మూవీ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 5 విరూపాక్ష ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement