Thursday, May 16, 2024

Palamur – నామినేషన్ దాఖలు చేసిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మిధున్ రెడ్డి

మహబూబ్ నగర్, నవంబర్ 8 (ప్రభ న్యూస్): ప్రజా శ్రేయస్సు పాలమూరు అభివృద్దే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన బంటుగా బిజెపి సీనియర్ నాయకులు ఏపీ జితేందర్ రెడ్డి తనయుడుగా మీ ముందుకు వచ్చానని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే పాలమూరు ప్రజలందరూ మెచ్చే జనరంజక పాలన అందిస్తానని మహబూబ్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన భారతీయ జనతా పార్టీ నుండి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేంద్ర మంత్రి వి.కే సింగ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీస్సులు,కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం వేలాది మంది కార్యకర్తలతో ఏ ఆర్ గార్డెన్ నుండి పెద్ద ఎత్తున కాషాయ జెండాలు చేతపట్టి ర్యాలీ చేపట్టారు.మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ చౌరస్తా, బస్టాండ్ కూడలి,అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా గడియారం చౌరస్తా వరకు ర్యాలీ చేరుకొని అక్కడ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అందరికీ మొండి చేయి చూపించి,తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుకున్నారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement