Saturday, April 27, 2024

వ‌డ్ల కొనుగోలు చేప‌ట్టాల‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు కాంగ్రెస్ విన‌తి

ప్ర‌భ‌న్యూస్‌, క‌రీంన‌గ‌ర్‌: వరి కోతలు ప్రారంభమైన దృష్ట్యా వెంటనే వ‌డ్ల‌ సేకరణకు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేర‌కు శ‌నివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆఫీసులో విన‌తిప‌త్రం అంద‌జేశారు. అంతేకాకుండా మార్క్ ఫెడ్ ద్వారా మ‌క్కజొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించాలని ఆ విన‌తిలో విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యంతోపాటు పార్టీ ప్రతినిధి బృందం నేత‌లున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement