Thursday, May 2, 2024

TS | గచ్చిబౌలి స్టేడియంలో ఓజోన్​ రన్.. ఉత్సాహంగా పాల్గొన్న రన్నర్స్​

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ కోసం.. సేవ్ వాట‌ర్ అండ్ నేష‌ర్ పేరుతో హైద‌రాబాద్‌లో ఇవ్వాల (ఆదివారం) ఓజోన్ ర‌న్ నిర్వహించారు.గచ్చిబౌలి స్టేడియంలో ఓజోన్ రన్ 2వ ఎడిషన్ కి గ్రీన్​ ఇండియా చాలెంజ్​ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఓజోన్ రన్ లో భాగంగా 10k, 5k, 2k రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రన్నర్స్ కి ఎంపీ సంతోష్ కుమార్ ట్రోఫీలను అందజేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ అధ్వ‌ర్యంలో విత్తన గణపతులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓజోన్ రన్ వ్యవస్థాపకులు బిల్వోవా వున్నం, తీర్ధా వున్నంల చొరవను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.

ఓజోన్ రన్ వ్యవస్థాపకురాలు మేఘనా ముసునూరి, సెక్రటరీ శ్రీధర్ వున్నం నేతృత్వంలోని SWAN (సేవ్ వాటర్ అండ్ నేచర్) చొరవ తో పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా దాదాపు వెయ్యికి పైగా రన్నర్స్ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డిసిపి సందీప్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement