Thursday, May 16, 2024

Breaking | చొప్పదండిలో రోడ్డు ప్రమాదం…పంచాయతీ సెక్రెటరీ మృతి

చొప్పదండి, (ప్రభ న్యూస్​) : క‌రీంన‌గ‌ర్‌ పట్టణంలోని మరలవాడ ప్రాంతంలో హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందిన మెర్జ రవీందర్ (54) తన ద్విచక్ర వాహనంపై ఆర్నకొండ నుండి చొప్పదండి వైపు వెళుతున్నాడు. ఈక్ర‌మంలో టిప్పర్ డ్రైవర్ వేగంగా వస్తూ బైక్ ని ఢీకొట్టడంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఆర్నకొండ గ్రామానికి చెందిన రవీందర్ గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతనికి భార్య ఒక కూతురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement