Thursday, May 9, 2024

Exclusive | విజృంభించిన భారత బౌలర్లు.. 50 పరుగులకే శ్రీలంక ఢమాల్​!

ఆసియా కప్​ ఫైనల్స్​లో భారత్​ సత్తా చాటుతోంది. ఈ కీలకపోరులో శ్రీలంక టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకంది. కాగా, భారత బౌలర్లు విజృంభించి ఆడడంతో ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది లంక జట్టు. పిడుగుల వంటి బంతులతో బౌలర్​ సిరాజ్​ విరుచుకుపడడంతో లంక బ్యాటర్లు దిక్కుతోచక వరుసగా పెవిలియన్​ బాటపట్టారు. ఈ క్రమంలో 4 ఓవర్లలోనే కీలకమైన 5 అయిదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 12వ ఓవర్​ వరకు 8 వికెట్లు నష్టపోయిన లంక కేవలం 48 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక.. మహ్మద్​ సిరాజ్​ ఆరు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక జట్టును కోలుకోకుండా చేశాడు.15 ఓవర్లకే లంక జట్టు ఆల్ అవుట్​ అయ్యింది.

ఇక.. శ్రీలంక బ్యాటర్లలో అత్యధిక పరుగులు 17 చేసిన వారిలో మెండిస్​ ఉన్నాడు. అయిదురుగు బ్యాటర్లు డక్​ అవుట్​ అయ్యారు. డక్​ అవుట్​ అయన వారిలో కుశాల్, సదీర, సరిత్​ అసలంక, ధనుష్ శనాకా​, మతీశ పతిరానా ఉన్నారు.

భారత బౌలర్లలో హార్దిక్​ పాండ్యా 3, మహ్మద్​ సిరాజ్​ 6, బుమ్రా 1 వికెట్​ పడగొట్టారు.

- Advertisement -

ఇక భారత జట్టు 50 ఓవర్లకు 51 పరుగులు చేయాల్సి ఉంది.. అంటే నిదానంగా ఆడుకున్నా ఈ ఫైనల్​ మ్యాచ్​ని అలవోకగా గెలుపొందొవచ్చు.

ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా స్టార్ పేస‌ర్, హైదరాబాద్​ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీ‌లంక‌కు చుక్క‌లు చూపించాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ మూడు ఓవ‌ర్ల‌లోనే కీలకమైన ఐదు వికెట్లు తీసి లంక‌ను చావు దెబ్బకొట్టాడు. ఏకంగా ఓకే ఓవ‌ర్లో 4 కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో అద్భుత బంతితో లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌(0)ను బౌల్డ్ చేశాడు. సిరాజ్ ధాటికి న‌లుగురు శ్రీ‌లంక బ్యాట‌ర్లు ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement