Tuesday, May 7, 2024

కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 5వేలను దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు వారీ కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ ప్రమాదకరస్థాయి పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 851 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 19, 141కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 652 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5369కు చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 38, 024మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 327, జనగామ 24, కరీంనగర్‌లో 30, ఖమ్మం 22, మంచిర్యాలలో 20, మేడ్చల్‌ మల్కాజిగిరి 61, నల్గొండ 26, నిజామాబాద్‌ 20, పెద్దపల్లి 37, రంగారెడ్డి 65, సంగారెడ్డి 24, సిద్ధిపేట 32, హన్మకొండ 21, యాదాద్రి భువనగిరి 25 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement