Monday, May 6, 2024

TS: ఇద్దరు ఎమ్మెల్సీలకు కేటీఆర్ కట్టడి.. మూడోసారి ముత్తిరెడ్డికే టికెట్..

జనగామ, సెప్టెంబర్ 9, ప్రభ న్యూస్.. జనగామ టికెట్ పై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరి ఎమ్మెల్సీలను కట్టడి చేసి.. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… జనగామ ఎమ్మెల్యే టికెట్ పై కొద్ది రోజులుగా జనగామపై ఎమ్మెల్సీలు కార్యకర్తలను అయోమయానికి గురిచేసే విధంగా ప్రయత్నించడంతో శుక్రవారం ఇద్దరు ఎమ్మెల్సీలను హైదరాబాదులో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వారిని కట్టడి చేశారన్నారు.

జనగామ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడకుండా కలిసికట్టుగా ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంగా ఐక్యమత్యంతో పనిచేద్దామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సిద్ధి లింగం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement