Friday, April 26, 2024

లాక్డౌన్ కి కెసీఆర్ నో

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని కేసీఆర్ అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పెట్టినా కేసులు తగ్గడం లేదని, అంతేకాకుండా దానివల్ల జనజీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై దాదాపు 4 గంటల పాటు అధికారులతో కెసిఆర్. చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement