Saturday, April 27, 2024

తక్కడ్‌పల్లిలో గుర్తుతెలియని శవం లభ్యం..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం తక్కడ్ పల్లి వద్ద 161 జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిలో జుక్కల్ మండలంలోని కౌలాస్ శివారు ఏరియా వైపు నీటిలో గుర్తు తెలియని శవం లభ్య‌మైంది. శవం ఉబ్బి బైటికి తేలటంతో ప్రయాణినికులు ఇట్టి విషయాన్ని గమనించి బిచ్కుంద, జుక్కల్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న జుక్కల్ ఎస్ఐ మురళీ పోలీసులు శవాన్ని బయటకు తీయించారు. వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, మృతినికి టి షర్ట్ , చడ్డీ ఉందని శవం నీటిలో ఉబ్బిపోయి ఉండటంతో శవాన్ని గుర్తు పట్టలేక పోతున్నామని పోలీసులు తెలిపారు. మృతి చెందిన కారణాలు తెలియవల్సి ఉందని, విచారణ చేస్తునామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement