Thursday, May 2, 2024

పట్టపగలే దొంగల బీభత్సం

నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని ముచ్కూరు గ్రామంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలే మూడు ఇండ్ల‌ తాళాలను పగలగొట్టి గుర్తుతెలియని దుండ‌గులు దొంగతనానికి పాల్పడినట్లు భీంగల్ ఎస్సై రాజ్ భరత్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దొంగలను వెంటనే పట్టుకుని తీరుతామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement