Sunday, May 5, 2024

ప్రమాద బాధిత కుటుంబాలకి.. ఎమ్మెల్సీ కవిత ఆర్థిక‌సాయం

నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మండలంలోని ఊట్ పల్లి గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత ప‌డ్డారు. బాధిత కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి నిరాశ్రయులయ్యారు. MLC కవిత త‌న ఉదారతను చాటుకొని బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.35,000.. ప్రమాదం లో గాయపడిన వారికి రూ.15,000 అంద‌జేశారు. కాగా ఎమ్మెల్సీ కవిత పంపిన ఆర్థిక సహాయాన్ని బోధన్ టిఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు . ఈ కార్యక్రమంలో కవిత వ్యక్తిగత సహాయకులు నవీన్ NDCCB.. డైరెక్టర్ గంగారెడ్డి.. మార్కెట్ కమిటీ చైర్మన్ VR దేశాయ్.. బుద్దె రాజేశ్వర్ వైస్ ఎంపీపీ.. గంగారెడ్డి ఉపాధ్యాయ సంఘం మాజీ నాయకులు.. ప్రస్తుత బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు.. రవి కిరణ్ బినోల సొసైటీ చైర్మ‌న్.. హను మగ్గరి సిర్ప సుదర్శన్ గణేష్ బోధన్ మండలం రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, వాల్మికి బోయ జిల్లా అధ్యక్షుడు నరేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వినోద్ మధుకర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement