Saturday, May 4, 2024

అదృశ్య‌మైన వ్య‌క్తి శ‌వ‌మై..

సిరికొండ : మార్చి ఒకటవ తారీకు నుంచి అదృష్యమైన లింగన్న (80) అనే వ్యక్తి అడవిలో సోమవారం శవమై కనిపించినట్లు సిరికొండ ఎసై నరేష్ తెలిపారు.ఎసై అందించిన వివరాల ప్రకారం.. మహాశివరాత్రిని పురస్కరించుకుని లొంక అడవుల్లోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మృతుడు తిరుగు ప్రయాణంలో అడవి గుండా తూంపల్లి వెళుతున్న తరుణంలో అదుపుతప్పి పడిపోవడం వల్ల తలకు తీవ్రమైన గాయం కావడంతో మరణించి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎసై వివరించాడు. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం మృతుడు లింగన్నకు మతిమరుపు ఉన్నట్లు చెప్పారన్నారు. శవం కుళ్ళిపోయినందున మరణించిన స్థలంలో డాక్టర్ తో శవ పంచనామా చేయించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు అయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement