Tuesday, April 30, 2024

రోగిని లాక్కెళ్లిన ఘటనపై డీఎంఈ బృందం విచారణ

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటనపై విచారణ మొదలైంది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్ ఆసుపత్రికి బృందం వచ్చారు. ఘటన పై ఇద్దరు ప్రొఫెసర్లతో డీఎంఈ రమేష్ రెడ్డి కమిటీ వేశారు. ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్లు కమిటీ సభ్యులు, ఆసుపత్రి వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో నేలపై ఈడ్చుకుంటు వెళ్లిన ఘటన వైరలైన వీడియోను కమిటీ సభ్యులు పరిశీలించారు. రోగికి సంబంధించి వివరాలపై డీఎంఈ తనిఖీ బృందం ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement