Wednesday, May 1, 2024

కారుతో సహా కొండపై నుంచి దూకిన కరస్పాండెంట్ దుర్మరణం..

కారుతో సహా కొండపై నుండి దూకిన కరస్పాండెంట్ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండలో విషాద ఘటన జరిగింది. దేవరకొండపై ఉన్న శ్రీ కొండమీద రాయుడి దేవాలయం దర్శనం అనంతరం తన స్విఫ్ట్ డిజైర్ కారులో తిరిగి కిందికి వస్తుండగా కొండపై నుంచి కారుతో సహా దూకేసి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ ఆత్మహత్య చేసుకున్నారు.

అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లోని శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ ఉమాపతి డ్రైవర్ ను దింపేసి.. కొండపై నుంచి కారును కిందకు డ్రైవ్ చేశాడు. కారు కొండపై నుంచి బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో ఉమాపతి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఉమాపతి కారుకు డ్రైవర్ ఉన్నారు.. కానీ ఆయన డ్రైవర్‌ను కిందకు దించేశారు. ఆ తర్వాత కారును నడుపుకుంటూ కొండపై నుంచి వెళ్లగా.. సెకన్ల వ్యవధిలోనే కారు పల్టీలు కొట్టింది. ఇదంతా చూస్తున్న డ్రైవర్‌ అరుస్తున్నా సరే.. ఉమాపతి పట్టించుకోలేదు. కొండపై నుంచి కారును నడుపుకుంటూ వెళ్లి.. దుర్మరణం చెందాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement