Thursday, April 25, 2024

వడ్ల కుప్పపై కౌలు రైతు మృతి, పది రోజులుగా కాoట కాకపోవడంతో దిగులు

దోమకొండ, (ప్రభన్యూస్) : కామారెడ్డి జిల్లాలో వ‌డ్ల కుప్ప‌పైనే రైతు ప్రాణం వ‌దిలాడు. ప‌ది రోజులుగా కాంటా కాక‌పోవ‌డంతో దిగాలు చెందిన రైతు గుండె ఆగిపోయింది. దోమకొండ మండలం సంగమేశ్వర్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వడ్ల కుప్పపై రాగట్లపల్లి సిద్ధిరాములు (45) చ‌నిపోయాడు. సిద్ధిరాములు కు ఎలాంటి సొంత భూమి లేదు. బంజర్ల గ్రామానికి చెందిన రావు నరసయ్య ద‌గ్గర నుంచి 4 ఎక‌రాల కౌలుకు తీసుకొని వరి పంట వేశాడు. పంట కోసి పది రోజులు అవుతున్నా వడ్ల కాంట పెట్టకపోవడంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. పది రోజులుగా వడ్ల కుప్ప పైనే సిద్ధిరాములు నిద్రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రోజూ మాదిరిగానే బుధవారం కూడా వడ్ల కుప్పపై పడుకున్నాడు. నిద్రలోనే గుండెపోటు రావడంతో చ‌నిపోయిన‌ట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రైతు మృతి విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని దోమకొండ ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement