Friday, April 26, 2024

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి

కామారెడ్డిలో మాస్టర్‌ ప్లాన్‌ రగడ ఇంకా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మాస్టర్‌ ప్లాన్‌తో తమ భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు సంయమనం పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చ్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. సీసీ పుటేజ్‌ ఆధారంగా బీజేపీ నేతలతోపాటు ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement