Sunday, May 19, 2024

Nizamabad | క్రీడలతోనే మానసిక ఉల్లాసం : ధనపాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : మానసిక ఉల్లాసానికి క్రీడలే మూలమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు అర్బన్‌ ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు తమ విధుల నిర్వహణలో ప్రతిరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒత్తిడికి గురవుతున్నారన్నారు. తరచూ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తూ సాధన చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం, యోగా, క్రీడలకు కొంత సమయం కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కమిటీ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement