Saturday, May 4, 2024

Happy New Year | అనాథలతో పవన్ సతీమణి సంబురాలు.. కేక్​ కట్​చేసి న్యూ ఇయర్​ వేడుకలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్​ సతీమణి అనా కొణిదెల అనాథలతో కలిసి న్యూ ఇయర్​ సంబురాలు చేసుకున్నారు. పవన్​ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండగా.. అనా మాత్రం తనకు ఇష్టమైన సోషల్​ యాక్టివిటీస్​లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఆయన చేసే ఆర్థిక సహాయాలు, మంచి మనసు అభిమానులకు గుర్తుకు వస్తుంది. ఎవరు ఏ ఆర్థిక సాయం కోరినా పవన్ కాదనకుండా చేస్తారని ప్రచారం. ఇప్పుడు పార్టీ ద్వారా పవన్ కొన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఇటీవల క్రిస్టమస్ వేడుకల్ని అనాథ శరణాలయంలో చిన్న పిల్లలతో జరుపుకున్నారు. ఆ సమయంలో ఆమె అనాథ శరణాలయానికి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా విరాళంగా అందించారు. 

ఇక.. తాజాగా మరోసారి అనా కొణిదెల న్యూ ఇయర్ వేడుకల్ని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయంలో జరుపుకున్నారు. అక్కడ చిన్న పిల్లలతో కలసి కేట్ కట్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వాళ్లకి అవసరమైన నిత్యావసర సరుకుల్ని కూడా అందించారు.

అంతేకాకుండా అనా కొణిదెల మరో గొప్ప పని చేసి అందరి హృదయాలు గెలుచుకున్నారు. ఐదుగురు బాలికలు స్కూల్ ఫీజు చెల్లించాల్సిన అవసరాన్ని ఫ్రెండ్స్ ట్రస్ట్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఆమె ఆ ఐదుగురు బాలిక స్కూల్ ఫీజు స్వయంగా చెల్లించి గొప్ప మనసు చాటుకున్నారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement