Wednesday, May 1, 2024

అయోధ్య మహా సైకిల్ యాత్ర..

బాన్సువాడ : రూ.లక్ష విరాళాన్ని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. బాన్సువాడ నుంచి అయోధ్యకు చేపట్టిన ‘శ్రీరామ రక్ష అయోధ్య మహా సైకిల్‌ యాత్ర’ను స్పీకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణానికి చెందిన 33 మంది స్వాములతో కూడిన బృందం సైకిళ్లపై అయోధ్యకు బయలుదేరారు. వారు కిలో బరువైన వెండి ఇటుకను రామ మందిర అధికారులకు అందించనున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ మందిర నిర్మాణానికి తమ కుటుంబం తరఫున రూ.1,01,116 విరాళంగా ఇస్తున్నట్లు పోచారం వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement