Saturday, April 20, 2024

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి… ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మేదిని రామలింగారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయ‌న‌ను ఎమ్మెల్యే వివేకానంద్ దుశ్శాలువతో స‌త్క‌రించారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వృత్తి నిబద్ధతకు మారుపేరు రామలింగారెడ్డి అని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు. 23 ఏళ్లుగా విద్యాపరంగా రామలింగారెడ్డి ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఖాజా పాశ, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామ్మోహన్ రెడ్డి, విజయ రాణి, దానయ్య, గోపాల్, శ్రీనివాస్, స్థానిక వార్డు సభ్యులు ఇందిర రెడ్డి, నాగ శేఖర్ గౌడ్, పెద్ది మల్లేశం, యేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement