Saturday, May 4, 2024

గుండెపోటుతో సర్పంచ్ మృతి

బిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగాట్లపల్లి గ్రామ సర్పంచ్ గంగయ్య శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సర్పంచ్ గంగయ్య మృతి పట్ల జిల్లా సర్పంచులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement