Sunday, April 28, 2024

NZB: బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే సురేందర్

నాగిరెడ్డిపేట్ : ఆగస్టు2 ప్రభ న్యూస్… మండలంలోని చినూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజూరి వెంకటేశం అనారోగ్యంతో మరణించినందున, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్ చినూరు గ్రామానికి చేరుకొని పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యంతో ఉండాలని, తన సహాయ, సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

అలాగే లింగంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు బద్దముల నరేష్ తండ్రి కాంతయ్య పక్షం రోజున మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ నాయకులు గుర్రాల సిద్దయ్య సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి, నాయకులు కిరణ్ కుమార్, కోనేరు కుమార్ రాజిరెడ్డి, దుండిగల్ నర్సింలు, వెంకట్రెడ్డి, బండ బాబురావు, ఆత్మకూరు బాబురావు, వంశీకృష్ణగౌడ్, హనుమంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement