Friday, May 17, 2024

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నేతల పరామర్శ

నిజామాబాద్ అర్బన్ : బాసర ట్రిపుల్ ఐటీలో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఈరోజు ఉదయం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎన్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు బల్మురి వెంకట్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణలు పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాసర విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు ధైర్యం చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. భోజన కాంట్రాక్టులన్నీ టీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్లవేనని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తో ములకత అయ్యారని ఆరోపించారు. గతంలో కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినా బాసర ట్రిపుల్ ఐటీపై పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల డిమాండ్లను ఎగతాళి చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement