Wednesday, May 1, 2024

Breaking : మ‌ద్యం తాగి ఇద్ద‌రు వృద్ధులు మృతి-రూ.50ల‌క్ష‌లు ప‌రిహారం అంద‌జేయాల‌ని డిమాండ్

మ‌ద్యం తాగి ఇద్ద‌రు వృద్ధులు మ‌ర‌ణించారు. కాగా మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కాగా మ‌రో న‌లుగురిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. రేపల్లె మండలం పోటుమెరకలో పెద్దఖర్మకు హాజరైన 8మంది రేపల్లె శివారు ఇసుకపల్లిలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సరకు తెచ్చుకొని తాగారు. వీరు భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.

గంట వ్యవధిలో గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య అనేఇద్దరు వృద్ధులు మృతిచెందారు ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ప్రభుత్వం అమ్ముతోన్న విష‌మ‌ద్యం తాగి ఇద్దరు బ‌ల‌య్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ. 50లక్షలు పరిహారంగా అందజేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డికి ధనదాహం తీరలేదని, మద్యం ద్వారా సంపాదించాలనే దురుద్దేశంతో జే బ్రాండ్‌ విషాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement