Wednesday, May 1, 2024

భార్య మృత‌దేహాన్నిమూడున్న‌ర కిలోమీట‌ర్లు భుజాల‌పై మోసిన భ‌ర్త‌..

కామారెడ్డి – మనుషులలో రోజురోజుకీ మానవత్వం మంటగలిసి పోతుంది. ప్రాణం పోయిన తర్వాత కూడా ఆ మానవత్వం బయటకు రావట్లేదు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసే నాగ లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది .అయితే నాగ లక్ష్మి కరోనాతో మరణించి ఉండవచ్చునని భావించి స్థానికులు ఎవరు కూడా ఆమె మృతదేహం వద్దకు రాలేదు. కనీసం ఆటోలో ఆయన ఆమె మృతదేహాన్ని స్మశాన వాటిక కి తీసుకువెల్దామంటే ఆటో వాళ్లు కూడా దగ్గరకు రాలేదు. అత‌డి స్థితిని గ‌మ‌నించి రైల్వే పోలీసులు, స్థానికులు రూ.2500 విరాళాలు సేకరించి మృతురాలి భర్త స్వామికి అందించారు. అయితే మృత‌దేహాన్ని మోసేందుకు మాత్రం ఎవ‌రూ ముందుకు రాలేదు.. దీంతో విధిలేని ప‌రిస్థితిలో భార్య‌ మృతదేహాన్ని భర్త స్వామి తన భుజాలపై ఎత్తుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలో స్మశాన వాటికకు తరలించారు. మధ్యమధ్యలో మృతదేహంతో భర్త స్వామి బిక్షాటన చేయడం కలచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement