Sunday, May 5, 2024

రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

బిక్కనూరు : రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ లింగాల కృష్ణ గౌడ్, ఎంపీపీ గాల్ రెడ్డి, ఇ మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్, మండల తెరాస అధ్యక్షులు నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల మల్లారెడ్డి, నాయకులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement