Friday, May 17, 2024

ఆర్య వైశ్య యువజన సంఘం సేవలు అభినందనీయం

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ (ప్రభ న్యూస్)29: ఆర్యవైశ్య యువజన సంఘ సేవలు అభినందనీయమని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు కొండవీర శేఖర్ గుప్తా ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శనివారం నిజాంబాద్ నగరంలోని గంజి ప్రాంతంలో గల ఆర్యవైశ్య పట్టణ సంఘ భవనంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వ ర్యంలో ఉచిత ఆరోగ్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు కొండవీర శేఖర్ గుప్తా ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పడి మొట్టమొదటిసారి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని రకాల సమస్యలకు ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా మందులను కూడా పంపిణీ చేయడం అభినంద నీయమని తెలిపారు. భవిష్య త్తులో మరిన్ని సేవా కార్యక్ర మాలు చేపట్టి నిరుపేద ఆర్య వై శ్యులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

యువజన సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ నగర ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతనంగా ఎన్నికైన అనుబంధ సంఘాల నూతన అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు, కోశాధికారులకు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మే ళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులను శాలువాతో యువజన సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పా టు చేసిన ఈ ఆరోగ్య శిబిరానికి అపూర్వ స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో యువజన సంఘం ఆధ్వ ర్యంలో మరిన్ని సేవా కార్యక్ర మాలు చేపడుతామని వెల్లడించారు. ఈ విధంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మంలో భాగంగా అందరినీ సన్మానించుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు
ఈ కార్యక్ర మంలో ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మా శక్తి లిఖిత్ కుమార్ గుప్తా, కోశాధికారి చేన్న రాఘవేందర్ గుప్తా, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement