Sunday, May 5, 2024

శంభాజీ భోంస్లే భార్య‌గా.. ర‌ష్మిక మంద‌న‌

ఓ భారీ పీరియాడిక‌ల్ చిత్రం తెర‌కెక్క‌నుంది. మరాఠీ యోధుడు.. మరాఠీ రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఛావా అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ డైరెక్ట్ చేయబోతున్న ఈసినిమాలో శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ పాత్ర కోసం.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశాల్‌ ను తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఆయనభార్య మహారాణి ఏసుబాయి భోంస్లే పాత్రలో రష్మికా మందన్నా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్ తో.. భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. కథ, పాత్రలో డెప్త్‌ తో పాటు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో.. అన్నీ నచ్చి రష్మిక ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ పాత్ర కోసం రష్మికా ఇప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టినట్టు సమాచారం. అప్పట్లో ఆడవారు, మహారణులు లైఫ్ స్టైల్ తో పాటు.. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. అప్పటి భాష, యాసలను కూడా ప్రాక్టీస్ చేయడం పాటు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారట రష్మిక. మొత్తానికి ర‌ష్మిక సూప‌ర్ ఛాన్స్ ని కొట్టేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement