Saturday, April 27, 2024

ఏఐసీసీ ఇంచార్జి పీసీ విష్ణునాథ్ తో నిజామాబాద్ మాజీ మేయర్ భేటీ

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి పి.సి.విష్ణునాథ్ తో నిజామాబాద్ మాజీ మేయర్, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి.సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో భేటీ అయిన సందర్భంగా పార్టీ నిర్మాణం, కార్యకలాపాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేయాలని పీసీ విష్ణునాధ్ సంజయ్ కి సూచించారు. పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం జనాల్లో ఉండాలని మార్గనిర్దశనం చేశారు.

ఈ సందర్భంగా సంజయ్ పార్టీ పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, మేనిఫెస్టో పై జరుగుతున్న చర్చ, లభిస్తున్న వివిధ వర్గాల మద్దతుపై లోతైన వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేస్తామని, అవిశ్రాంతంగా పని చేస్తామని, పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లతామని, రైతు, యువజన, పార్టీ డిక్లరేషన్లను ప్రజలకు వివరిస్తామని, బలమైన సంకల్పంతో ముందుకెళ్తామన్నారు. సంజయ్ రాజకీయ విశ్లేషణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విష్ణునాథ్, అయన భుజం తట్టి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement