Tuesday, May 14, 2024

గుండెపోటుతో డిచ్ పల్లి ఎంపీఓ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మండల పంచాయతీ అధికారి నాగేంద్రప్ప గుండెపోటుతో మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆర్య నగర్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నాగేంద్రప్ప గుండెపోటుకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా.. ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితమే నాగేంద్రప్ప డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జాయిన్ అయినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement