Wednesday, May 15, 2024

NZB | ధన్పాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి : సినీ న‌టి క‌విత‌

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) : కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి పరుగులు పెడ్తుందని బిజేపి నాయకురాలు, సినీ నటి కవిత దశరథ్ రాజ్, చీకోటి ప్రవీణ్ లు అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. సోమవారం నగరంలో 42 వ డివిజన్ లో, గాంధీ చౌక్ లో మహిళా మోర్చా నాయకులు మహిళా సోదరి మనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి కవిత హాజరయ్యారు.

శివాజీ చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరి గిందనీ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ పథకాలలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. అవినీతి తో రాష్టాన్ని బ్రష్టు పట్టించారనీ మండిపడ్డారు. నగరంలో బిగాల గణేష్ 9 సంవత్సరాల నుండి ఏమి చేయలేదన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నిజాంబాద్ అర్బన్ లో డబల్ బెడ్ రూమ్ లో ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను కేసీఆర్ ఆగం చేసిండ్రు అని ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ అవకాశలు లేక వేరే దేశాలు ప్రయాణం అవుతున్న ఇక్కడ ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణం అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అమలు చేస్తాం అన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధన్పాల్ సూర్యనారాయణ రాజకీ యాల్లోకి రాక ముందు నుంచి నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ట్రస్టు ఏర్పాటు చేసి ట్రస్టు నుంచి అనేక సేవా కార్యక్ర మాలు చేసిన విషయం మీకు తెలిసిందేనని అన్నారు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ధన్పాల్ సూర్యనారా యణకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నిజామాబాద్ అర్బన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement