Sunday, May 5, 2024

BRS campaign – అభివృద్ధి కే పట్టం కట్టండి.. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, నవంబర్ ప్రభన్యూస్)27:. నిజామాబాద్ అర్బన్ లో నగరం మరింత అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయాలని.. అభివృద్ధి కే పట్టం కట్టండి అర్బన్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాల కోరారు. సోమవా రం వినా యక్ నగర్ హనుమాన్ జంక్షన్ నుండి ఫులాంగ్, ఆర్.ఆర్. చౌరస్తా, వర్ని చౌరస్తా, ఖిల్లా రోడ్, నెహ్రు పార్క్,గాంధీ చౌక్,దేవి రోడ్, శివాజీ చౌక్, సంజీవయ్య కాలనీ మీదుగా సుభాష్ నగర్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు

. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ నగరం గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ప్రస్తుతం బిఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ ,మున్సిపల్ కార్యాలయం, మినీ ట్యాంక్, బంద్, వైకుంఠధామాలు, ఐటీ హబ్ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు నిజాంబాద్ అర్బన్ లో చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మరోసారి అవకాశమిచ్చి భారీ మెజారి టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ గబి.ఆర్.ఎస్ నాయకులు మాజీ నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్,సిర్ప రాజు కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement