Monday, April 29, 2024

NZB: బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహబాహి

బిచ్కుంద టౌన్, ఆగస్టు 23 (ప్రభ న్యూస్) : మండల కేంద్రంలో బీజేపీ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం బుదవారం బీజేపీ, బీజేవైఎం పార్టీ శ్రేణులు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఇంటి ముట్టడి ప్రయత్నంలో ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే తన నివాసం నుండి పెన్షన్ దారుల పెంపు కార్యక్రమానికి తన కార్యకర్తలతో ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒకేసారిగా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినదిస్తూ అడ్డగించడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యే పైకి వస్తారా అంటూ ఇరుపార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరుపార్టీల వారిని సముదాయించి స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణ వాతావరణంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన పెన్షన్ దారుల పెంపు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ తోపులాటలో పలువురు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు గాయాల పాలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement