Thursday, April 25, 2024

ఆర్మూర్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో రక్తదాన శిబిరం

నిజామాబాద్ సిటీ, మార్చి (ప్రభ న్యూస్) : ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణ దాతలవ్వండని బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట వద్ద గల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా యువ నాయకులు సొంత రమేష్ (చిన్నరం), జాదు సురేష్, అల్లరి ప్రశాంత్, వినోద్, గల్వే ప్రశాంత్, గల్వే శ్రీకాంత్, డీకంపల్లి ప్రశాంత్, మధుకర్, రజనీకాంత్, గంగోని మధు, బబ్లు గంగారెడ్డి, సాయిలు, కృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement