Saturday, April 27, 2024

NZB: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్…

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి 29 (ప్రభ న్యూస్) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ లో చేరానని మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం తెలిపారు. అకుంఠిత దీక్షాప రులు.. పట్టు వదలని విక్రమార్కులు…తెలంగాణ ప్రజల పరిపూర్ణ దీవెనలు కలిగి ఉన్న ప్రజా సేవకులు.. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులై నిజామాబాద్ నగర బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో మాజీ మేయర్ ఆకుల సుజాత ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మాజీ కార్పొరేటర్ కెప్టెన్ తేజస్విని శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కోఆప్షన్ సభ్యులు టి చంద్రకళ, అంత రెడ్డి లతా దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు వై.గంగామణి నరేందర్ గౌడ్, గోపు సుగుణ లక్ష్మణ్, పుప్పాల విజయ బాజన్న, శ్రీహరి నాయక్, మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి సూరి, మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తం, జెండా బాలాజీ, ఆలయ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాష్, 6వ డివిజన్ అధ్యక్షులు చిన్నంగారి గంగారెడ్డి, రియల్ ఎస్టేట్ అధ్యక్షులు ఎద్దండి మధుసూదన్ రెడ్డి, మావూరి పెద్దులు, సలేందర్ బాబురావు, జాగృతి నాయకులు చింతకాయల రంజిత అపర్ణ, మాజీ పురం సభ్యులు ఎలదండి కృష్ణ, డివిజన్ అధ్యక్షులు మాకు రవి, గంగస్థాన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రమేష్, బీసీ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు వీర్ కుమార్ లు కాంగ్రెస్ కండువా కప్పు కున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement