Tuesday, May 14, 2024

కడెం ప్రాజెక్టు వ‌ర‌ద‌ను ప‌రిశీలించిన నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే రేఖా నాయక్

కడెం. జులై 21 ప్రభా న్యూస్. – నిర్మల్ జిల్లా లోని కడెం ప్రాజెక్టుకు భారీ వరదరావడంతో ఖానాపూర్ ఎమ్మేల్యే అజ్మీరా రేఖ నాయక్ అక్కడికి వెళ్లి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిర్మల్ జిల్లా.కలెక్టర్ వరుణ్ రెడ్డి రప్పించి అధికారులను ప్రజా ప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ముప్పు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేయాలని చెప్పారు. 13గేట్ల ద్వారా నీటిని వదలడం జరుగుతుంది అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ధైర్యంగా ఉండాలని అన్నారు

ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు గ్రామంలో రెండు రోజులు వర్ష ప్రభావం ఎక్కువ ఉన్నందువల్ల ప్రాంతాలకు వెళ్లాలని యువత చురుకుగా ఉండాలని కోరారు.వారి వెంట ప్రజాప్రతినిధులు వారి వ్యక్తిగత సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారుఆమె వెంట నీటి పారుదల శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement