Monday, May 6, 2024

New Cases – దేశంలో కొత్త‌గా 423 కరోనా కేసులు … న‌లుగురు మ‌ర‌ణం…

ఢిల్లీ – దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 423 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. ఇండియాలో అత్యధికంగా కేరళలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 266 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొత్తగా 8 కేసులు రాగా, ఏపీలో కూడా కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న దేశవ్యాప్తంగా కరోనాతో నలుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు కేరళలో చనిపోగా, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు చనిపోయారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement