Tuesday, May 7, 2024

WGL : న‌ర్సంపేట మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్‌కు అస‌మ్మ‌తి సెగ‌

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పురపాలక సంఘంలో ఛైర్ ప‌ర్సన్ మార్పు జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే తప్పేలా లేదు అనిపిస్తుంది. ఛైర్‌ప‌ర్స‌న్‌గా కొనసాగుతున్న రజనీ కిషన్ పై సొంత పార్టీ కౌన్సిలర్ లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

గత జూన్​లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఛైర్‌ప‌ర్స‌న్‌ను మార్చాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమదాయించి సమస్యను తాత్కాలికంగా నిలిపివేయగా,మళ్లీ ఛైర్‌ప‌ర్స‌న్‌ మార్పును పట్టుబట్టి పలువురు తెరలేపగా ఓ నేత ఇంట్లో ఈ సమావేశం జరిగినట్లు,మరల జరగనున్నట్లు తెలుస్తుంది. ఛైర్‌ప‌ర్స‌న్‌ రేసులో నాగిషెట్టి పద్మ ప్రసాద్,రుద్ర మల్లీశ్వరి ప్రకాశ్, గందే రజిత చంద్రమౌళి తో పాటు పలువురు ఉన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తుంటే మున్సిపాలిటీలో ఛైర్‌ప‌ర్స‌న్‌మార్పు తప్పేలా లేదు అనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement