Wednesday, May 1, 2024

NLG: సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి.. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ, అక్టోబర్ 7(ఫ్రభ న్యూస్) : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామంలో మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమంలో భాగంగా రూ.20లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ.20లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి, ధర్మ తాండలో రూ.1.12కోట్లతో చేపడుతున్న బీటీరోడ్డు పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నున్సవత్ పార్వతిచందు నాయక్, జడ్పీటీసీ నేనావత్ బుజిలచ్చిరం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు యసాని రాజవర్ధన్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, రమావత్ మోహన్ కృష్ణ, స్థానిక సర్పంచ్ నాగార్జున్, మర్ల శ్రీశైలం, మాధవరం శంకర్ రావు, ఎంపిడిఓ రాములు నాయక్, ఏఇ రాజు, బొడ్డుపల్లి కృష్ణ, బాలవద్ది రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement