Wednesday, May 15, 2024

NLG: ఆప్యాయంగా పలకరిస్తూ.. ఎమ్మెల్యే కిషోర్ సతీమణి కమల వినూత్న ప్రచారం

మోత్కూర్, నవంబర్ 23 (ప్రభ న్యూస్) : అమ్మా బాగున్నావా.. అక్కా బాగున్నావా..! అంటూ ఆప్యాయతగా పలకరిస్తూ తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాధరి కిషోర్ సతీమణి కమల ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని గల్లీలో ఇల్లిల్లు తిరుగుతూ సంప్రదాయ బద్దంగా కుంకుమ బొట్టు పెట్టి వినూత్న ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. ఉద్యమకారుడు మర్రి అనిల్ తల్లితో మాట్లాడి నాటి ఉస్మానియా క్యాంపస్ లో గడిపిన రోజులను గుర్తు చేశారు. పెద్డఎత్తున మహిళలతో కలిసి గడపగడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో కిశోర్ ని గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వెంట కౌన్సిలర్ లు పురుగుల వెంకన్న, లెంకల సుజాత, రైతు బంధు జిల్లా సభ్యురాలు ధబ్బేటి శైలజ, మండల అధ్యక్షురాలు మల్లం అనిత, పట్టణ అధ్యక్షురాలు కట్ట ఇంద్రజ్యోతి, తంగేళ్లపల్లి కమల్, గనగాని శైలజ, రేగోటి ఉషారాణి, పురుగుల సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement