Wednesday, May 1, 2024

NLG: గిరిజన బాంధవుడు కేసీఆర్.. ఎమ్మెల్యే కూసుకుంట్ల

సంస్థన్ నారాయణపురం, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్) : గిరిజన బాంధవుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నారాయణపురం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి నూతన గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, వైస్ ఎంపీపీ ఆంగోతు రాజు నాయక్, సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి, ఎంపీటీసీ గాలయ్య యాదవ్, తాసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో రాములు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement