Saturday, May 4, 2024

TS: 15రోజులుగా సీఎం కేసీఆర్ గాయబ్.. ఇక బీఆర్ఎస్ చీలడం తథ్యం… బండి

15రోజులుగా కేసీఆర్ కనబడుట లేదని…. బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోడీ బయట పెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందని చెప్పారు.

తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందన్నారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement