Friday, April 26, 2024

యాదాద్రిలో రెండో విడుత కంటి వెలుగు షురూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం యాదాద్రి భువనగిరిలో అట్టహాసంగా ప్రారంభ‌మైంది. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, భువనగిరి లో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, రాచకొండ డీసీపీ నారాయణరెడ్డి అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, డిఎంహెచ్ వో మల్లికార్జున్, జనాగం పాండు, జడల యశీల్ గౌడ్ లు ప్రారంభించారు. జిల్లాలో 17 మండలాలలో 421 గ్రామ పంచాయితీలలో 525 కేంద్రాల్లో కంటి వెలుగు కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని, ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement