Saturday, May 4, 2024

వర్షాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అనిల్ రెడ్డి

అనంతగిరి జూలై 20(ప్రభ న్యూస్) : గడిచిన మూడు రోజుల నుంచి మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించాలని ఎస్సై అనిల్ రెడ్డి కోరారు.పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున అటు వైపు వెళ్లే వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వాహనదారులు, రైతులు,ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు.విద్యుత్‌ స్తంభాలు,ట్రాన్స్‌ఫార్మర్‌లు చిన్న పిల్లలు ముట్టుకోకుండా చూడాలని సూచించారు.ప్రయాణ సమయంలో రోడ్లు,వంతెనలు తెగిపోయినా రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్‌ అధికారులకు తెలపాలని కోరారు.చెరువులు,వాగులు,కుంటలు నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement