Wednesday, May 1, 2024

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

మద్దిరాల జులై 20 ప్రభ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిగూడెం తో పాటు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెల్లో పల్లె దవఖానాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నియోజకవర్గంలో 100 పడకల ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేశామని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎస్ ఏ రజాక్ జిల్లా నాయకులు యుగేందర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి తాసిల్దారు అమీన్ సింగ్ గ్రామ సర్పంచులు బరపటి ఉపేందర్ ఎస్ ఏ ఇంతియాజ్ కాతున్ రజాక్ ఎంపీటీసీ నాగే లి శ్రీలత శ్రావణ్ కుమార్ మధుసూదన్ రావు పాల బిందెల శ్రీనివాస్ వలపు రమేష్ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement