Thursday, May 2, 2024

నిద్రలోనే మృత్యు ఒడికి.. ఇంట్లో గోడకూలి తల్లీకూతురు మృతి

నల్గొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పద్మానగర్ కాలనీలోని ఓ ఇంట్లో గోడకూలి తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. తెల్లవారు జామున త‌ల్లీకూతుళ్లు నిద్రిస్తున్న సమయంలో అక‌స్మాత్తుగా ఒక్క‌సారిగా గోడకూలి, బీరువా మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)గా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ఇటీవలే కళ్యాణికి వివాహం అయ్యింది. కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి వలస వచ్చి న‌ల్గొండ ప‌ద్మాన‌గ‌ర్ నివ‌సిస్తూ.. ఇక్కడ రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృత దేహాల‌ను పోలీసులు మార్చురీకి తరలింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement